Rashmi: యాంకర్ రష్మీ గౌతమ్ ఓ వైపు జబర్దస్త్లో నటిస్తూనే మరోవైపు సినిమాల్లోనూ నటిస్తూ జోరుమీదుంది. ఇటీవల వరుస అవకాశాలతో అటు సినిమా ఇండస్ట్రీలోనూ, ఇటు బుల్లితెరపై కూడా తనదైన మార్క్ చూపిస్తోంది. జబర్దస్త్లో సుడిగాలి సుధీర్ ఉన్నంత వరకు వీరి మధ్య అనేక సీన్లు సినిమా సీన్లకంటే హైప్ ఇచ్చి చూపించారు. వీరిద్దరి మూలంగా షోకూ పేరు వచ్చింది. రేటింగ్ విషయంలో వీరిద్దరి మధ్య సీన్లు భలే వినియోగించుకుంది మల్లెమాల టీమ్, ఈటీవీ బృందం.
ఇక తాజాగా ఈ షో నుంచి సుడిగాలి సుధీర్ తప్పుకోగా రష్మీ కొనసాగుతోంది. తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీలోనూ రష్మీ కొనసాగుతోంది. ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్పై ఓ కమెడియన్కు రష్మీ సారీ చెప్పింది. ఈ వారం కాయిన్స్ ఎపిసోడ్లో భాగంగా రష్మీ ఒక గ్లాస్ లోని జ్యూస్ తాగితే అందులో గోల్డ్ కాయిన్ వచ్చింది. ఈ సందర్భంగా రష్మీ మాట్లాడుతూ కాస్త ఆసక్తికర అంశాలను వెల్లడించింది.
తాను లైఫ్లో ఓ మనిషికి సారీ చెప్పాలంటూ ప్రసంగం స్టార్ట్ చేసింది రష్మీ. ఆ మనిషి ఎవరో కాదు మీ అందరికీ కూడా బాగా తెలుసని చెప్పింది. అతను తన ట్యాలెంట్తో స్కిట్స్ చేస్తుంటే తాను అంతగా పట్టించుకోలేదని తెలిపింది రష్మీ. అయితే, ఈ ప్రయాణంలో ఎన్నో విషయాలను తనతో పంచుకున్నాడంది. తొలుత పట్టించుకోలేదని, తర్వాత అతను తన పర్మార్మెన్స్తో, స్కిట్స్తో కనెక్ట్ అయ్యాడని చెప్పింది.
అందుకే సారీ చెబుతున్నా..
అందుకే మనస్ఫూర్తిగా సారీ చెప్పాలనుకుంటున్నానంది. ఆ బాబు ఎవరో కాదు మన ఆర్టిస్ట్ బాబు అంటూ చెప్పింది రష్మీ. అప్పట్లో ఆయన వేసిన వేషాలకు యాక్టర్ బాబు కాస్త రైటర్ బాబు అయ్యాడని తెలిపింది. అప్పుడు తామంతా సీరియస్గా తీసుకున్నాం కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నాడని చెప్పింది. అవకాశం ఇవ్వకపోతే కోసుకుంటా అంటూ బెదిరించాడని, అందుకే ఈ రైటర్ బాబుని ఆర్టిస్ట్ బాబుగా మార్చామని చెప్పింది రష్మీ. అందుకు ఆడియన్స్కు సారీ చెప్పింది. ఇదంతా సుడిగాలి సుధీర్ గురించేమో అని అందరూ భావించారు. ఆఖర్లో ట్విస్ట్ ఇచ్చింది రష్మీ.