Mahesh, Allu Arjun,Vijay: మహేష్ బాబు, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ ముగ్గురి ప్లాన్ ఒకటేనా.. ఏం జరిగిందంటే?

Mahesh, Allu Arjun,Vijay: మామూలుగా సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు యాడ్స్ లో నటిస్తూ బిజినెస్ రంగంలో కూడా రాణిస్తూ ఉంటారు. హీరోయిన్లతో పోల్చుకుంటే హీరోలు ఎక్కువగా బిజినెస్ లు చేస్తూ బిజినెస్ రంగంలో కూడా దూసుకుపోతూ ఉంటారు.. సినిమాలలో వచ్చిన కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెడుతూ బిజినెస్ లలో పెడుతూ రెండు వైపులా సంపాదిస్తూ ఉంటారు. అలా ఇప్పటికే టాలీవుడ్ లో ఎంతోమంది హీరోలు సినిమాలను నటించడంతో పాటు సినిమాలను నిర్మిస్తూ మల్టీప్లెక్స్ లను రన్ చేస్తూ బిజినెస్ లలో కూడా రాణిస్తున్నారు.

2018లో ఈ రంగంలో మొదట ఎంట్రీ ఇచ్చింది ప్రిన్స్‌ మహేశ్‌ బాబు AMB అయితే ఆ తర్వాత ప్రభాస్‌ సూలురుపేటలో ఎ-పిక్‌ పేరుతో భారీ థియేటర్‌ నిర్మించాడు. విజయ్‌ దేవరకొండ కూడా మహబూబ్‌నగర్‌లో AVD పేరుతో మూడు స్క్రీన్స్‌ ఉన్న మల్టీప్లెక్స్‌ను రన్‌ చేస్తున్నాడు.కాగా కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌ అమీర్‌పేటలోని సత్యం థియేటర్‌ స్థానంలో అల్లు అర్జున్‌ కూడా AAA పేరుతో భారీ మల్టీప్లెక్స్‌ నిర్మించాడు. అందుకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ వస్తుండటంతో బన్నీ మరో బిగ్‌ ప్రాజెక్ట్‌పై కన్నేశాడని వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్‌లో టాప్‌ క్లాస్‌ మల్టీప్లెక్స్‌ల జాబితాలో AMB మొదటి స్థానంలో ఉంటుంది. ది గోల్డ్‌ వెర్షన్ ఆఫ్‌ సిల్వర్‌ స్క్రీన్‌ అనుభూతిని పొందాలంటే తప్పకుండా ఏఎంబీ సినిమాస్‌ కు వెళ్లాల్సిందే.

దీంతో బన్నీ కూడా అదే రేంజ్‌లో మరో మల్టీప్లెక్స్‌ను కోకాపేటలో నిర్మించాలనే ప్లాన్‌లో ఉన్నారట. హైదరాబాద్‌లోనే అత్యంత ఖరీదైన ఏరియాల్లో కోకాపేట కూడా చేరిపోయింది. అక్కడ అల్లు అరవింద్‌ గతంలోనే కొంత ల్యాండ్‌ను కొన్నారు. ఇప్పుడు బన్నీకి అదొక బెస్ట్‌ అడ్వాంటేజ్‌ అని చెప్పవచ్చు. అక్కడే AAA మల్టీప్లెక్స్‌ను ఆయన ప్లాన్‌ చేస్తున్నారని తెలుస్తోంది. ఇలా రెండో ప్రాజెక్ట్‌ను మహేశ్‌ బాబు బెంగళూరులో ఎప్పుడో స్టార్ట్‌ చేశాడు. త్వరలో అక్కడ కూడా AMB పేరుతో ప్రారంభం కాబోతుంది. నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. విజయ్‌ దేవరకొండ కూడా ఏవీడీ పేరుతోనే హైదరాబాద్‌లో మరో మల్టీప్లెక్స్‌ నిర్మించేందుకు ప్లాన్‌ చేస్తున్నారట. ఇలా ఇండస్ట్రీలోని టాప్‌ హీరోలు థియేటర్ల నిర్మాణ రంగంలో దూసుకుపోతున్నారు. ఇలా టాలీవుడ్ లో ఈ ముగ్గురు హీరోలు కూడా ఒకే విధంగా ఆలోచించడంతోపాటు ఒకే రంగంలో రాణిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Note for Vote Case: ఓటుకు నోటు కేసును కావాలనే తెరపైకి తెస్తున్నారా.. చంద్రబాబును కావాలనే టార్గెట్ చేస్తున్నారా?

Note for Vote Case:  ఓటుకు నోటు కేసు రెండు తెలుగు రాష్ట్రాలలో అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించినదో మనకు తెలిసిందే. ఇలా ఓటుకు నోటు కేసులో భాగంగా చంద్రబాబు నాయుడు రేవంత్...
- Advertisement -
- Advertisement -